హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకొన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బుధవారం ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు.
ఈ నెల10న మృతి చెందిన సమాజ్వాది పార్టీ అధినేత ములాయంసింగ్యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లారు. వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్న ఆయన బుధవారం హైదరాబాద్కు చేరుకొన్నారు. ఆ వెంటనే ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.