వనపర్తి : అంగన్వాడీల ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తిలోని తన నివాసంలో
అంగన్వాడీలతో జరిగిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
అంగన్వాడీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ..రూ.7,500 జీతాన్ని రూ.10,500 చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. రాష్ట్రంలోని 70 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు సర్కారు అండగా నిలిచిందన్నారు.
అంగన్వాడీ పట్టభద్రులు టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి ఆశీర్వదించాలన్నారు. అంగన్వాడీలను బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించింది, పరిష్కరించబోయేది కూడా తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మీ సహకారం, ఆశీస్సులు ఉంటే మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్, టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు విప్పటూరి విక్రం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.