హైదరాబాద్ : రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యేక విధానాలు, ఇన్సెంటివ్లు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు, మౌలిక వసతుల కల్పన, సుస్థిర శాంతిభద్రతలు, నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా, మానవ వనుల లభ్యత వల్ల ఐటీ రంగంలో అభివృద్ది సాధ్యమైందని అధికారులకు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ను, అధికారులను సీఎం ప్రశంసించారు.
ఐటీ రంగంలో గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించి, దేశంలో అగ్రగామిగా నిలిచిందని ఐటీ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేష్ రంజన్ కేబినెట్ కు తెలిపారు. ఐటీ రంగంలో అగ్రగామిగా ఉన్న బెంగళూరు నగరంలో 1 లక్షా 48 వేల ఉద్యోగాలు కల్పన చేయగా, హైదరాబాద్ అంతకంటే ఎక్కువగా 1 లక్షా 55 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించడం జరిగిందని ఐటీ అధికారులు వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచింది అని ఆర్థిక శాఖ అధికారులు కేబినెట్ కు వివరించారు.