సిద్దిపేటలోని కోమటి చెరువు వద్ద బుధవారం ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ కనువిందు చేసింది. గుజరాత్లోని వడోదరలో నర్మదా నదిపై మొదటి ఆక్వాస్క్రీన్ మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉండగా.. రెండోది సిద్దిపేటలో బుధవారం మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ ప్రదర్శన నిర్వహిస్తారు. మ్యూజిక్కు అనుగుణంగా ఫౌంటెయిన్లో జలాలు విరజిమ్ముతాయి. బుధవారం నిర్వహించిన ఈ షోలో లేజర్ కిరణాలతో ఏర్పడిన సీఎం కేసీఆర్ చిత్రం విశేషంగా ఆకట్టుకున్నది. – సిద్దిపేట