హైదరాబాద్: గాంధీజీ 153వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. మరికాసేపట్లో గాంధీ దవాఖానలో ఏర్పాటు చేసిన మహాత్ముడి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు.