తెలంగాణలో కొనసాగుతున్న ‘నీటి పునరుజ్జీవన’
ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నీటిని సంరక్షిస్తూ ప్రకృతి సమతుల్యా న్ని కాపాడటమే రేపటితరానికి మనం కూడబెట్టే అత్యంత విలువైన సంపద అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. తెలంగాణలో ‘జల పునరుజ్జీవన’ ఓ ఉద్యమంలా కొనసాగుతున్నదని, దీనిపై జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రశంసలు కురుస్తున్నాయని చెప్పారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా సోమవా రం సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో అడుగంటిపోయిన జలాలను తిరిగి వృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సాగు, తాగునీటి పథకాలను అమలుచేస్తున్నదని పేర్కొన్నారు.
మిషన్ కాకతీయ పథకం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల నిర్మాణంతో భూఉపరితల జలాల లభ్యత పెరుగడంతోపాటు, అడుగంటిన భూగర్భ జలాలు పైపొరల్లోకి చేరేలా పునరుజ్జీవన జరుగుతున్నదని తెలిపారు. మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన, శుద్ధిచేసిన, సురక్షిత తాగునీటిని గడపగడపకూ అందించడం ద్వారా తెలంగాణ తాగునీటి కష్టాలను పారదోలడమే కాకుం డా, ఫ్లోరైడ్ వంటి ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపినట్టు పేర్కొన్నారు. ఆరేండ్ల లో చేపట్టిన చర్యల ఫలితంగా తెలంగాణ జలవనరుల స్వరూపం గుణాత్మకంగా అభివృద్ధి చెం దిందని వివరించారు. తెలంగాణలో జల పునరుజ్జీవన కార్యక్రమాలను కేంద్రం సహా ప్రపంచ జల వనరుల నిపుణులు కొనియాడుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు.
వందేండ్లదాకా నీటి కొరత ఉండదు: వీ ప్రకాశ్
రాష్ట్రంలో వచ్చే వందేండ్లదాకా నీటి కొరత ఉండదని తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఎఫ్టీసీసీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక నీటి సంరక్షణకు అనేక చర్యలు చేపట్టిందన్నారు.