హైదరాబాద్ : రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి శ్రీ ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. యూపీఏ ప్రభుత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో ఆస్కార్ ఫెర్నాండెజ్ రోడ్డు రవాణా, హైవేలు.. కార్మిక, ఉపాధికల్పన శాఖలకు మంత్రిగా పనిచేశారన్నారు. తొలి యూపీఏ ప్రభుత్వంలోని క్యాబినెట్లో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి జాతీయ రాజకీయాలకు తీరని లోటని, ఆయన చేసిన సేవలు గొప్పవన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.