వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 30: పదేండ్ల క్రితం వరకు ఎడారిని తలపించిన తెలంగాణలో ఇప్పుడు ఎటుచూసినా పచ్చదనమే కనిపిస్తున్నదని గుజరాత్ రైతు లు ప్రశంసించారు. అనతి కాలంలోనే తెలంగాణను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. ‘కేసీఆర్ దేశ్కా నేతా బనేతో భారత్కా ఉన్నతి హోగా’ (దేశానికి కేసీఆర్ నాయకత్వం వహిస్తే ప్రపంచ దేశాల్లో భారత్ సమున్నత స్థాయికి ఎదుగుతుంది) అని పేర్కొన్నారు. వారం రోజుల క్రితం గుజరాత్ నుంచి బయల్దేరిన ఈ రైతులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించి తెలంగాణకు చేరుకొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వెటర్నరీ కళాశాల, అగ్రిహబ్ను సందర్శించాక ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు. తెలంగాణలో విద్యు త్తు, సాగు, తాగునీటి వ్యవస్థలను అభివృద్ధి చేయడం అద్భుతమన్నారు.
కేసీఆర్తోనే దేశాభివృద్ధి వేగవంతం
కేసీఆర్ నాయకత్వంలో దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రస్తుతం దేశానికి పట్టుదల ఉన్న నాయకుడు కావాలి. అలాంటి నేతగా తెలంగాణ సీఎం కేసీఆర్కు మంచి పేరు ఉన్నది. ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారు .
– నట్టూ బాయ్, రైతు, కాన్వాడీ గ్రామం, జిల్లా ఆనంద్, గుజరాత్
అంత పట్టుదల కేసీఆర్లోనే..
ఏదైనా మంచి పని చేయాలంటే పట్టుదల ఉండాలి. ఇందిర తర్వాత కేసీఆర్ మినహా దేశంలో అంత పట్టుదల ఉన్న నేతలెవరూ లేరు. ప్రధానిగా మోదీ దేశా న్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదు. రైతుల అభ్యున్నతికి కృషిచేస్తున్న కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లోకి రావా లి. – నట్వర్సింగీ, రైతు, అడ్డాస్ గ్రామం, ఆనంద్ జిల్లా, గుజరాత్
పల్లెలు పచ్చగా ఉన్నాయి
తెలంగాణలో గ్రామాలు పచ్చగా మారాయి. వృద్ధులకు సీఎం కేసీఆర్ ప్రతి నెలా పింఛన్ అందజేయడం, కులవృతులవారికి అండగా నిలవడం అభినందనీయం. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అక్కడ ఎంతో మంది చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తున్నది.
– అంతాబేరి, చిరువ్యాపారి, అద్రి గ్రామం, ఆనంద్ జిల్లా, గుజరాత్
సీఎం కేసీఆర్తో అందరికీ పనులు
ఇంట్టి పెద్ద మంచివాడైతే ఆ ఇల్లు చక్కగా ఉంటుంది. అందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణే నిదర్శనం. తెలంగాణలో స్థానికులతోపాటు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ తదితర రాష్ర్టాల వారికీ ఉపాధి లభిస్తున్నది. పంట పొలాలతోపాటు పరిశ్రమల్లోనూ పనులు లభిస్తున్నాయి. – లిల్లాబెన్, గృహిణి, కాన్వాడీ గ్రామం, ఆనంద్ జిల్లా, గుజరాత్