యావత్ దేశం నివ్వెరపోయేలా ప్రతి రంగంలో తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నది. బలీయమైన ఆర్థికశక్తిగా మారింది. ప్రజల ఆశీర్వాద బలం, ప్రజాప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే ఇది సాధ్యమైంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు ప్రతి స్పందించిన తెలంగాణ ప్రజానీకం ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఎగరేయటంతో నేడు యావత్ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణశోభితమై మెరిసి మురిసి పోతున్నది.
జాతీయోద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్య్ర పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నాం.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్ కోతలతో పవర్ హాలీడేలతో భయంకరమైన బాధలు అనుభవించింది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కరెంటు కష్టాలకు చరమగీతం పాడిన రాష్ట్రంగా చరిత్రకెకింది.
నేటి వజ్రోత్సవ సందర్భంలో రాష్ట్ర ప్రజలకు శుభవార్తను తెలియజేస్తున్నాను. పింఛన్ల లబ్ధిదారుల సంఖ్యను అత్యధికంగా పెంచడం ద్వారా మన తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిషరించిందని సవినయంగా
తెలియజేస్తున్నాను. – సీఎం కేసీఆర్
గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రగతిని చాటిచెప్పిన ముఖ్యమంత్రి నగరం త్రివర్ణ శోభితమైంది. ప్రతి చోటా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. దేశభక్తి ఉప్పెనై.. ఉరకలెత్తింది. స్వతంత్రోత్సాహం కదం తొక్కింది. త్యాగధనుల జ్ఞాపకాలు కండ్ల ముందు కదలాడగా, మేరా భారత్ మహాన్ అంటూ.. ప్రతిధ్వనించింది. సోమవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని నగరవాసులు ఘనంగా జరుపుకొన్నారు. గోల్కొండ కోట, ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ జాతీయ పతాకాలను ఆవిష్కరించి.. వందనం సమర్పించారు. అంతకుముందు పరేడ్గ్రౌండ్స్లో అమర జవాన్లకు నివాళులర్పించారు.
సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : చారిత్రక గోల్కొండ కోట త్రివర్ణ శోభితమైంది. 75 ఏండ్ల స్వాతంత్య్ర సంబురాలు సోమవారం గోల్కొండ కోటలో అంగరంగ వైభవంగా జరిగాయి. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వేడుకలు ఆద్యంతం కన్నుల పండువగా సాగాయి. వివిధ సాంస్కృతిక కళా బృందాలు, డప్పు వాయిద్యాలు, నృత్యాలు, బోనాలు, గిరిజన, ఆదివాసీ సంప్రదాయ నృత్యాలు వజ్రోత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు జాతీయ స్ఫూర్తిని నింపాయి. సీఎస్ సోమేశ్కుమార్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, పోలీస్ పరేడ్ మధ్య ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం భారత స్వేచ్ఛా పతాకాన్ని సగర్వంగా సీఎం కేసీఆర్ ఎగురవేయగా, సమరయోధుల స్మరణతో, జయ జయధ్వానాలతో కోట ప్రాంగణమంతా మార్మోగింది. అంతకుముందు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, నేరుగా సింకింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లోని అమర జవాన్ల స్మారక స్థూపాన్ని సందర్శించారు. అమర జవాన్మ స్మృతి చిహ్నం వద్ద పుష్పాంజలి సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంలో
అమరులైన ఎందరో వీరుల త్యాగాలను సీఎం స్మరించుకున్నారు.
ప్రగతి భవన్లో జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్రావు
గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలో పాల్గొన్న వజ్రోత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కే. కేశవరావు, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, నవీన్కుమార్, బండ ప్రకాశ్, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, కడియం శ్రీహరి, బొంతు రామ్మోహన్, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు
పరేడ్ మైదానంలో అమరజవాన్లకు సీఎం కేసీఆర్ నివాళులు