హైదరాబాద్ : ఆర్టీసీపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష ప్రారంభమైంది. ప్రభుత్వ సహకారంతో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై కరోనా, పెరిగిన డీజిల్ రేట్ల భారం నేపథ్యంలో.. తిరిగి పుంజుకునేందుకు అవలంభించాల్సిన విధివిధానాలపై సీఎం సమీక్ష చేపట్టారు. సమావేశంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్రెడ్డి, సైదిరెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ నర్సింగరావు, సీఎం కార్యదర్శి రాజశేఖర్రెడ్డి, రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.