హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. స్నానం చేయడానికని నదిలో దిగి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని సీఎం విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురిలో ఆరుగురు మృతిచెందిన సంగతి తెలిసిందే. సురక్షితంగా బయటపడిన వ్యక్తిని దర్పల్లి రవికాంత్(15)గా గుర్తించగా.. మృతులను జిలకర్ర సురేశ్(40), జిలకర్ర యోగేష్(16), బొబ్బిలి శ్రీనివాస్ (40), బొబ్బిలి సిద్ధార్థ్(16), బొబ్బిలి శ్రీకర్(14), దొడ్లె రాజు(24)గా గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
విషాదం : గోదావరిలో స్నానానికి వెళ్లి ఆరుగురి మృతి
నిజామాబాద్ ఘటన బాధాకరం : మంత్రి వేముల
నిజామాబాద్ ఘటనపై ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి
కారుపై పడ్డ కంటైనర్.. నలుగురు దుర్మరణం
నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు యువకులు దుర్మరణం