హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రైతు ఉద్యమంలో మరణించిన పంజాబ్, హర్యానా రాష్ర్టాలకు చెందిన 693 రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అందజేశారు. గల్వాన్ లోయలో అమరులైన నలుగురు జవాన్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 10 లక్షల ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. ఆదివారం మధ్యాహ్నం చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ల సమక్షంలో సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ 28 మంది పంజాబ్ రైతులు, ఐదుగురు హర్యానా రైతులతోపాటు నలుగురు అమర జవాన్ల కుటుంబ సభ్యులకు చెక్కులు అందించారు. మిగిలిన రైతుల కుటుంబ సభ్యులకు నోడల్ అధికారుల చేత చెక్కులు పంపిణీ చేశారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి..
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడుసాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా ఆందోళనలు చేపట్టి.. ఉద్యమంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఆ హామీ మేరకు ఆదివారం ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే బాధితులకు ఆర్థికసాయం అందచేశారు. తెలంగాణ ప్రభుత్వ సహకారానికి పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా కిసాన్, జవాన్ ఒకటేనని అన్నారు. ప్రాంతాల తేడా లేకుండా సాయం చేయడానికి చొరవ తీసుకున్న కేసీఆర్ను వారు అభినందించారు.
అమరులైన పంజాబ్ రైతులు- చెకు అందుకున్నవారు
గురుచరణ్ సింగ్ : రూపన్ ప్రీత్ కౌర్
జైసింగ్ : కుల్వీందర్ కౌర్
లీలాసింగ్: అమర్ జీత్ కౌర్
సుఖ్మందర్ సింగ్: హరిందర్ జీత్ సింగ్
నిర్భయ్ సింగ్: గుర్ప్రీత్ కౌర్
నిషాన్ సింగ్ : కరణ్ బీర్ సింగ్
జాగీర్ సింగ్ : బూటా సింగ్
జనక్రాజ్ : సాహిల్
హర్పీందర్ సింగ్ : జస్వీందర్ సింగ్
సద్గురు సింగ్ : జగదీప్ సింగ్
కరమ్జీత్ సింగ్ : హర్మన్ప్రీత్ సింగ్
గురుప్రీత్ సింగ్ : రాజ్ప్రీత్ కౌర్
సుఖ్వీందర్ సింగ్ : కోమల్ప్రీత్ కౌర్
ముఖ్తేర్ సింగ్ : సుఖ్వీందర్ సింగ్
జగరాజ్ సింగ్ : బక్షీష్ సింగ్
మోహిందర్ సింగ్: గగన్దీప్ సింగ్
గుర్మీత్ సింగ్: సుఖ్వీర్ సింగ్
బచన్ సింగ్: సుఖ్పాల్ సింగ్
హర్తేత్ సింగ్: గుర్లాల్ సింగ్
గుర్జంత్ సింగ్: మంజిందర్ సింగ్
గురుప్రీత్ సింగ్: జగ్తార్ సింగ్
బల్వీందర్ సింగ్ : మన్వీర్ సింగ్
భూపీందర్ సింగ్ : చరణ్ జీత్ సింగ్
భూపీందర్ సింగ్ : హర్దీప్ సింగ్
మలీత్ సింగ్ : రాజా
బాబూ సింగ్ : గుర్జీత్ సింగ్
మేఘ్ సింగ్ : గుర్మీత్ సింగ్
బల్దేవ్సింగ్ : నరీందర్ కౌర్
అమరులైన హర్యానా రైతులు
దయానంద్ : సావిత్రి
కమల్ సింగ్ : చాసా సింగ్
జగ్బీర్ : రోషిణి
గురుప్రీత్ సింగ్ : సత్నామ్ సింగ్
రాజ్బీర్ సింగ్ : సుమిత్ర
గాల్వన్ లోయలో చైనాతో జరిగిన సంఘర్షణలో అమరులైన జవాన్లు మణిదీప్ సింగ్, గురుతేజ్ సింగ్, సత్నామ్ సింగ్, గుర్బీందర్ సింగ్ వారి కుటుంబ సభ్యులకు ఒకొకరికి రూ.10 లక్షల చొప్పున చెకులను సీఎం కేసీఆర్ అందించారు.