హైదరాబాద్ : సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పై రాష్ట్ర SC, ST, BC ఉద్యోగ సంఘాల, తెలంగాణ గజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (TGO) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్గౌడ్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రంలో వైన్ షాపుల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలతోపాటు, గౌడ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పించినందుకు హర్షం వ్యక్తం చేశారు. రవీంద్రభారతిలో ని తన కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, బీసీ, TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం దుకాణాల కేటాయింపులో ఎస్సీలకు-10 శాతం, ఎస్టీలకు-5 శాతం, గౌడ కులస్తులకు-15 శాతం రిజర్వేషన్లు కేటాయించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్రంలో కుల వృత్తులన్నింటికీ పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. అభినవ పూలేగా సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని అన్నారు. ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకు వస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో TGO కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A. సత్యనారాయణ, TGO కేంద్ర సంఘం నాయకులు సహదేవ్, వెంకటయ్య, MB కృష్ణయాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.