హైదరాబాద్ : నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డిని సీఎం అభినందించి శాలువాతో సత్కరించారు. రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.