CM KCR | బర్మింగ్హాం వేదికగా జరుగుతున్న కామల్వెన్త్ క్రీడల్లో తెలంగాణ సంచనలం నిఖత్ జరీన్ పసడి పతకం సాధించింది. 48-50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్కు చెందిన బాక్సర్ కార్లీ మెక్నాల్ను ఓడించి బంగారు పతకాన్ని సాధించింది. ఈ సందర్భంగా నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించడంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశారు. బాక్సన్కు అభినందనలు తెలిపారు. నిఖత్ జరీన్ గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవాప్తమైందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.