హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుడు, గాయకుడు జంగ్ ప్రహ్లాద్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. గాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో పలు సేవలు అందించారని గుర్తుచేసుకున్నారు. జంగ్ ప్రహ్లాద్ సాంస్కృతిక కృషి ఎప్పటికీ మరువలేమన్నారు. ప్రహ్లాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గురువారం ఉదయం హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జంగ్ ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను నిమ్స్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తుదిశ్వాస విడిచారు. ఆయన స్వస్థలం
యాదాద్రి జిల్లాలోని భువనగిరి మండలం హన్మాపురం. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.