హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరోనా బారినపడిన ఎస్వీ ప్రసాద్.. నగరంలోని యశోద దవాఖానలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు.
ఉమ్మడి ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కుటుంబం ఇటీవల కరోనా బారిన పడింది. ఆయనతోపాటు కుంటుంబ సభ్యులు యశోద దవాఖానలో చేరారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించింది. దీంతో మంగళవారం ఉదయం మృతిచెందారు. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఎస్వీ ప్రసాద్.. 1975 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో సీఎస్గా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో విజిలెన్స్ కమిషనర్గా పనిచేశారు.