హైదరాబాద్ : రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, అటవీశాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ్యులుగా ఉండనున్నారు.
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్, దవాఖానల్లో ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చిస్తున్నది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల పూర్తి వివరాలు తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి సమగ్ర సమాచారం తెప్పించాలని సూచించారు.