రాష్ట్రంలోని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, దళిత బంధు మాదిరిగానే గిరిజన బంధు పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన గిరిజన బాంధవుడని పలువురు పేర్కొన్నారు. సేవాలాల్, కుమ్రంభీమ్ ఆశయాలకు అనుగుణంగా గిరిజన జాతి అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మేలు మరువమని.. రుణపడి ఉంటామంటూ.. గిరిజన, ఆదివాసీ జాతి తరపున హృదయపూర్వకంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనులకు మేలు..
రాష్ట్రంలోని పేద గిరిజన బిడ్డలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ గిరిజన బంధును ప్రకటించడం హర్షణీయం. ఎన్నో ఏండ్లుగా గిరిజనులు ఎదుర్కొంటున్న పోడుభూముల సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చారు. భూమిలేని గిరిజనులందరికీ ఈ నిర్ణయంతో ఎంతో మేలు జరుగుతుంది. గిరిజనులతో పాటు అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు గిరిజన బిడ్డల తరపున కృతజ్ఞతలు.
– బి.బాలునాయక్, డీయూఆర్ఎఫ్ డైరెక్టర్, జేఎన్టీయూహెచ్
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తర్వాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మార్గదర్శకంగా పనిచేస్తుంది సీఎం కేసీఆరే. రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్న పోడుభూముల సమస్యలను పరిష్కరించడం ప్రతి గిరిజన కుటుంబానికి భూమినందించేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం. భూమి లేని గిరిజనులకు దళితబంధు తరహాలో ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించడంతో గిరిజన జాతి సంతోషపడుతున్నది. భూమి, భుక్తి లేకుండా ఎలాంటి ఆధారం లేని గిరిజనలందరికీ ఈ పథకం ఉపయోగపడుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గిరిజన బంధును ప్రకటించిన సీఎం కేసీఆర్కు గిరిజనులు నీరాజనం పలుకుతున్నారు.
– బి.ధర్మానాయక్, వీసీ ఓఎస్డీ, జేఎన్టీయూహెచ్
దళిత, గిరిజనుల అభ్యున్నతికి పెద్దపీట
దళిత బంధు పథకం దేశంలోనే ఎక్కడా లేని ఓ గొప్ప పథకం. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం మంచి ఆలోచన. ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత, గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారు.
– ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వరరావు, తెలుగు శాఖ అధ్యక్షుడు, హెచ్సీయూ
సాహసోపేతమైన నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం చారిత్రత్మక నిర్ణయం. ఎంతో సాహసోపేతంగా ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో యావత్ గిరిజన, ఆదివాసీల జీవితాల్లో మార్పు రావడం ఖాయం. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ల నిర్ణయాన్ని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటే గిరిజన, ఆదివాసీలకు ద్రోహిగా మిగిలిపోతుంది.
– కేశావత్ రామకృష్ణనాయక్, షేక్పేట తహసీల్దార్, (గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి)
గిరిజనుల పాలిట కేసీఆర్ దేవుడు
గిరిజనుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడు. ఎవరూ ఊహించని విధంగా గిరిజనుల కోసం భవనాలు నిర్మించడమే కాకుండా పది శాతం రిజర్వేషన్ చేస్తామని ప్రకటించినందుకు గిరిజనులు ముఖ్యమంత్రికి ఎప్పుడు రుణ పడి ఉంటారు. గిరిజనుల కోసం గిరిజన బంధు ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే గిరిజనుల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయి.
-దుర్గా దీప్లాల్ చౌహన్, మేయర్ మీర్పేట
కేసీఆర్ను మించిన నాయకుడు లేడు
పట్టుదలలో సీఎం కేసీఆర్ను మించిన నాయకుడు దేశంలో ఎక్కడా లేరు. తరాల తరబడి ఊరికి దూరంగా నెట్టివేయబడ్డ తండాలను గ్రామ పంచాయతీలుగా చేశారు. ఇప్పుడు గిరిజన బంధు ప్రకటించడం అభినందనీయం.
– ఝరస్లా చినానాయక్ , ఉద్యాన విశ్వవిద్యాలయం
సీనియర్ శాస్త్రవేత్త, ఔషధ మొక్కల విభాగం హెడ్.
రఘునాథపాలెం, ఖమ్మం జిల్లా
ఆర్థికంగా ఎదిగేందుకు దోహదం
గిరిజనులు పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎదిగేలా గిరిజన బంధు తోడ్పడుతుంది. ఉన్నత విద్య అభ్యసించిన యువతకు ఈ పథకం ఎంతో మేలు చేస్తుంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందు చూపుతో అన్ని వర్గాల ప్రజల కోసం సాహసోపేతమైన పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా బంజారా అత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేలా నగరం నడిబొడ్డున బంజారాభవన్ నిర్మించడం చారిత్రాత్మక నిర్ణయం.
-డాక్టర్ రమావత్ రెడ్యానాయక్, జైనీ ఫార్మా ఇన్నోవేషన్, పారిశ్రామికవేత్త
ధన్యవాదాలు
గిరిజనులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నాం.గిరిజనుల అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిన కేసీఆర్ తాజాగా దళిత బంధులాగే గిరిజనబంధు కూడా ఇస్తామని ప్రకటించడం గొప్ప విషయం.
– డాక్టర్ కరాటే రాజునాయక్, ఆలిండియా బంజారా స్టూడెంట్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
గిరిజనుల జీవితాల్లో వెలుగులు
గిరిజన జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నారు. బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారాభవన్ ప్రారంభించడం అభినందనీయం. గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, గిరిజన బంధు ప్రకటించడం హర్షణీయం.
– కేతావత్ రతన్, తెలంగాణ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి
గిరిజనులకు అండగా..
దళిత బంధు మాదిరిగా గిరిజనుల అభివృద్ధి కోసం గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం హర్షణీయం. పోడు భూముల సమస్యను పరిష్కారిస్తామని, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం సంతోషకరం. సీఎం కేసీఆర్ గిరిజనులకు అండగా ఉన్నారు. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
-వడ్య్తా కల్యాణ్ నాయక్, సేవాలాల్ సేనా గ్రేటర్ అధ్యక్షుడు
అద్భుతమైన పథకం
గిరిజన బంధు పథకం అద్భుతమైంది. బంజారుల జీవన విధానంలో సమూల మార్పు తీసుకువస్తుంది. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– ప్రొఫెసర్ బాబురావు, తెలుగు యూనివర్సిటీ
సీఎం కేసీఆర్ అభిమానులయ్యారు
బంజారాల పేరుతో రూపుదిద్దుకున్న ప్రాంతం బంజారాహిల్స్లో బంజారా, ఆదివాసీ భవన్లను ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన బంధు పథకాన్ని ప్రకటించిన సీఎం కేసీఆర్ గిరిజనుల మనసును చూరగొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మహాత్మాగాంధీ తర్వాత ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే గిరిజనుల సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రధాన పరిపాలన కేంద్రమైన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం దళితులు, గిరిజనుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న అభిమానానికి నిదర్శనం. ప్రపంచ మేధావి అంబేద్కర్ను గౌరవించిన విధానం చాలా గొప్పది. బంజారాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్కు ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల్లో ఉన్న గిరిజనులు ఆయన అభిమానులుగా మారారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 15 కోట్ల మంది బంజారాలు ఆయన దేశ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్ర గిరిజనులుగా ఎంతో గర్విస్తున్నాం.
-ప్రొఫెసర్ బానోతు రమణానాయక్, చైర్మన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్), రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం
గొప్ప విషయం
తెలంగాణ రాష్ట్రంలో గిరిజన బంధు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు. గిరిజనులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ పథకానికి రూపకల్పన చేయడం గొప్ప విషయం. మారుమూలలో ఉన్న తండాలు, ఆదివాసీలు సైతం ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి, గిరిజనుల స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్ల పెంపు హామీని నిలుపుకోవడం హర్షణీయం.
– డాక్టర్ ఆర్. చంద్రునాయక్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్(ఓయూ),నేషనల్ బంజారా ప్రొఫెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
చరిత్రలో నిలిచిపోతారు..
ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం నూతన పథకాలను సైతం ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతల ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతారు. కేసీఆర్కు గిరిజన జాతి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. -ప్రొఫెసర్ సూర్యా ధనంజయ, తెలుగు విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ
ఎంతో ఉపయోగం
సీఎం కేసీఆర్ ప్రకటించిన గిరిజన బంధు పథకం ఎంతో ఉపయోగకరం. ప్రస్తుతం రాష్ట్రంలో 40 నుంచి 50 లక్షల వరకు ఉన్న గిరిజన జనాభాలో దాదాపు 10 లక్షల మంది గిరిజనులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది.
– ప్రొఫెసర్ ఆనంద్ పోవర్, బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ
హర్షించగదిన విషయం
ఆదివాసీ, గిరిజనుల సమగ్రాభివృద్ధికి బాటలు వేసే క్రమంలో సీఎం కేసీఆర్ గిరిజన బంధు ప్రకటించడం యావత్ గిరిజన సమాజం హర్షించగదిన విషయం. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సాహసోపైతమైన నిర్ణయం తీసుకున్నారు.
– ఆచార్య భట్టు రమేశ్, రిజిస్ట్రార్, తెలుగు యూనివర్సిటీ
రుణపడి ఉంటాం
వెనకబడిన గిరిజనులను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు గిరిజన బంధు తోడ్పడుతుంది. గిరిజన బంధు ప్రకటించడమే కాకుండా, 10 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినందుకు గిరిజనుల పక్షాన ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జిల్లాల వారీగా గిరిజన, ఆదివాసీల జీవన ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యేలా అధ్యయనం చేసి పారిశ్రామికంగా ఎదిగేలా గిరిజన బంధు సద్వినియోగం చేసుకునేలా పర్యవేక్షణ చేపట్టాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా గిరిజన జాతికి ఆత్మగౌరవ భవనాలు నిర్మించడంతో పాటు గిరిజన బంధు ప్రకటించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– రామదాస్, ప్రముఖ కవి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
గిరిజనుల స్థితిగతులపై ఉద్యమ సమయంలో పాదయాత్ర ద్వారా అధ్యయనం చేసిన సీఎం కేసీఆర్.. రాష్ట్రం సాధించిన తరువాత దశల వారీగా హామీలు నెరవేరుస్తున్నారు. ఆయనకు గిరిజన, ఆదివాసీ జాతి తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం గిరిజన జాతికి సీఎం కేసీఆర్ ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. కోట్లు విలువ కలిగిన బంజారాహిల్స్లో ఆత్మగౌరవ భవనాలు నిర్మించడం జాతికి ఇస్తున్న ప్రాధాన్యంగా చూడవచ్చు. సేవాలాల్, కుమ్రంభీమ్ ఆశయాలకు అనుగుణంగా గిరిజన జాతి అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
– డాక్టర్ గుగులోత్ శంకర్ నాయక్,కమిషనర్, సమాచార హక్కు చట్టం