యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో మంగళవారం సీఎం కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.