Ashok Gehlot | ఆజాదీకా అమృత్ మహోత్సవ్కి సంబంధించిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ కూడా పాల్గొన్నారు. అయితే గెహ్లోత్ మోదీ పాల్గొన్న వేదికపై నుంచే కీలక వ్యాఖ్యలు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో వాతావరణం ఏమీ బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు, హింసాత్మక వాతావరణం నెలకొందని, ఇలాంటి వాతావరణాన్ని పూర్తిగా తొలగించాలని కోరారు. దేశం శాంతి, సామరస్యాలతో అభివృద్ధి పథంలో నడవాలని తాము కోరుకుంటున్నట్లు సీఎం గెహ్లోత్.. ప్రధాని మోదీ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంపై ప్రధాని మోదీ మాత్రం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. వివిధ రంగాల్లో మహిళల పాత్ర ఎలా వుందన్న విషయంపై మాట్లాడుతూ, ముందుకి సాగిపోయారు.