నిజామాబాద్, సెప్టెంబర్ 22 : ఎగువ ప్రాంతాల నుంచి వరద ఉధృతి తగ్గడంతో ఎస్సారెస్పీ గేట్లను మూసివేసి గోదావరిలోకి నీటి విడుదల నిలిపి వేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. వరద కాలువకు సాయంత్రం 4 గంటలకు మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 404 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 5,500, కాకతీయ కాలువకు 2,500, వరద కాలువకు 3వేలు, లక్ష్మీకి 200, సరస్వతీకి 100 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు.
ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 81 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా గురువారం సాయంత్రానికి 1090.30 అడుగుల (86.461 టీఎంసీలు) వద్ద ఉందని ఆయన తెలిపారు.