లక్నో : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CDRI) స్వదేశీ ఔషధం ఉమిఫెనోవిర్ (Umifenovir)ను అభివృద్ధి చేసింది. డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ను లక్నో సీఎస్ఐఆర్ సంస్థ నిర్వహిస్తోంది. ఉమిఫెనోవిర్ డ్రగ్ను ట్రయల్స్లో ఐదు రోజుల పాటు సరైన మోతాదులో రోజుకు రెండుసార్లు ఇస్తే.. తేలికపాటి, మితమైన లక్షణాలున్న రోగుల్లో వైరల్ లోడ్ను సమర్థవంతంగా తగ్గించగలదని తేలిందని సీడీఆర్ఐ డైరెక్టర్ తపస్ కుండు పేర్కొన్నారు.
కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU), రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RMLIMS)తో పాటు ఎరా లక్నో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (ELMCH) లో ఉమిఫెనోవిర్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఉమిఫెనోవిర్ అనేది బ్రాడ్ స్పెక్ట్రం యాంటీ వైరల్. ఇప్పటికే రష్యా, చైనాతో పాటు పలు దేశాల్లో 20 సంవత్సరాలుగా ఇన్ల్ఫు ఎంజా, న్యుమోనియాకు చికిత్సలో వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉమిఫెనోవిర్ మూడో విడుత ట్రయల్స్ నడుస్తుండగా.. మొదటి, రెండు ట్రయల్స్ తప్పనిసరి కాదని సీడీఆర్ఐ డైరెక్టర్ పేర్కొన్నారు.
సీడీఆర్ఐ నేరుగా ఫేజ్ -3 ట్రయల్ నిర్వహిస్తోందని, ఆసుపత్రుల్లో చేరిన, వైద్యుల పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్న 132 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించినట్లు డైరెక్టర్ పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్లో డెల్టా వేరియంట్ బారినపడ్డ రోగులు సైతం ఉన్నట్లు చెప్పారు. క్లినికల్ ట్రయల్స్లో రోజుకు రోజుకు రెండు మోతాదుల చొప్పున ఉమిఫెనోవిర్ (800mg) ఇచ్చిన తర్వాత తేలికపాటి, మితమైన లక్షణాలున్న రోగుల్లో వైరల్ లోడ్ సున్నా శాతానికి చేరిందని గుర్తించారు. అలాగే రోగులు ఎలాంటి దుష్ఫ్రభావాలకు గురి కాలేదని సీడీఆర్ఐ డైరెక్టర్ పేర్కొన్నారు.
సీఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ఆఫ్ మైక్రోబయల్ టెక్నాలజీ (IMT), చండీగఢ్ సహకారంతో సీడీఆర్ఐ నిర్వహించిన అధ్యయనాల్లో ఉమిఫెనోవిర్ సార్స్-కోవ్2 మంచి సెల్ కల్చర్ నిరోధించినట్లు చూపిందని, అలాగే మానవ కణాల్లోకి సార్స్-కోవ్2 వైరస్ ప్రవేక్షించకుండా నిరోధించినట్లు ప్రొఫెసర్ కుండు తెలిపారు. ఇంతకు ముందెవరూ డ్రగ్ను కొవిడ్ చికిత్సకు వినియోగించనందున ఇన్స్టిట్యూట్ డోసేజ్ ప్లాన్ను పేటెంట్ పొందిందని చెప్పారు.
డీసీజీఐ క్లినికల్ ట్రయల్స్ డేటాను విశ్లేషించారని, అత్యంత ప్రోత్సాహకరమైన ఫలితాలతో అత్యవసర ఆమోదం కోసం మరింత తేలికపాటి, లక్షణ రహిత రోగులపై అధ్యయనాలు కొనసాగించాలని ఆయన బృందానికి సూచించారు. శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన సీడీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఆర్ రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రస్తుత మందులతో పోలిస్తే కొవిడ్-19 రోగులకు 50-54శాతం వరకు తక్కువ ధరకు ఉమిఫెనోవిర్ లభిస్తుందని, తద్వారా ఆర్థికంగా ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
డ్రగ్ గర్భిణులు, పిల్లలకు సైతం సురక్షితమని అధ్యయనాలు చూపించాయన్నారు. పిల్లలకు ఉమిఫెనోవిర్ సిరప్, పౌడర్ రూపంలో, పఫ్ ఇన్హేలర్గా ఉపయోగించే అవకాశాన్ని పరిశీలిస్తూ రవిశంకర్ వివరించారు. ఇదిలా ఉండగా డ్రగ్ ట్రయల్స్కు డీజీసీఐ గతేడాది జూన్లో అనుమతి ఇచ్చింది. సీడీఆర్ఐ రసాయన శాస్త్రవేత్తల బృందం.. అజయ్ కే శ్రీవాస్తవ, చంద్రభూషణ్ త్రిపాఠి, నయన్ ఘోష్, నీలాంజన మజుందార్, విద్యార్థుల బృందం డ్రగ్ను అభివృద్ధి చేసింది.