వాహనదారులకు అవగాహన కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): పెండింగ్ చలాన్ల క్లియరెన్స్పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. 45 రోజుల పాటు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తూ.. జరిమానాల చెల్లింపులకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశం గత నెల 15వ తేదీతో ముగిసింది. నగరానికి చెందిన 65 శాతం మంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. మిగతా 35 శాతం మంది ముందుకు రాలేదు. అయితే కూడళ్లలో వాహనాల తనిఖీ చేపడుతున్న ట్రాఫిక్ పోలీసులు.. ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
లాక్డౌన్ ఉల్లంఘన కేసులు..
న్యాయస్థానం కల్పించిన రాయితీకి మంచి స్పందన
లాక్డౌన్ ఉల్లంఘనలపై నమోదైన పెట్టీ కేసుల పెండెన్సీ తగ్గించడంలో భాగంగా న్యాయస్థానం కల్పించిన రాయితీ అవకాశానికి మంచి స్పందన లభిస్తున్నది. లాక్డౌన్ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి.. సుమారు 3 లక్షలు కేసులు నమోదయ్యాయి. అయితే వెయ్యి రూపాయల జరిమానా వేయగా, ఒక్కో సెక్షన్కు రూ. 10 చొప్పున చెల్లించే విధంగా డిస్కౌంట్ను ప్రకటించారు. సోమవారం నుంచి ఈ అవకాశం అందుబాటులోకి రావడంతో పలువురు సద్వినియోగం చేసుకున్నారు.