గతేడాది కరోనా కారణంగా లాక్డౌన్లతో పండుగ సీజన్ చప్పగా సాగింది. ఈ క్రమంలో నిరుడు ఆగిపోయిన బోనస్లు, ఇక్రిమెంట్లను ఈ ఏడాది కంపెనీలు ఇస్తున్నాయి. దీంతో ఈసారి అందుతున్న దీపావళి బోనస్లతో అధిక వడ్డీ అప్పులను తీర్చేయడం, ఎమర్జెన్సీ ఫండ్ను పెంచడం వంటివి చేయడం ఉత్తమమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా క్రెడిట్ కార్డ్ బకాయిలను తీర్చాలని సలహా ఇస్తున్నారు. ఇక కొవిడ్.. ఎమర్జెన్సీ ఫండ్ అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇప్పటిదాకా ఎమర్జెన్సీ ఫండ్ అనేదే లేకపోతే బోనస్ మొత్తాన్ని అందుకోసమే వినియోగించండి.