అమరావతి : పల్నాడు జిల్లా శావల్య మండలం కారుమంచి గ్రామంలో అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 21 మంది గాయపడ్డారు. రాత్రి గ్రామంలో నిద్రిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఇళ్లపై వైసీపీ నాయకులు రాళ్లు, కర్రలు, ఇనుప రాళ్లతో దాడులకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు.
గాయపడ్డ వారిలో 13 మంది టీడీపీ వర్గీయులు, 8 మంది వైసీపీ వర్గీయులను వినుకొండ ఆస్పత్రిలో చేర్పించారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ గోవర్ధన్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనికి మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు గుంటూరు ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందస్తుగా గ్రామంలో 144 సెక్షన్ విధించారు.