అమరావతి,జూన్ 29:విద్యార్థులు చెడు అలవాట్ల బారిన పడకుండా ఉంచేందుకు ఆంధ్ర ప్రదేశ్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వ స్కూల్స్ కు 200 మీటర్ల దూరం వరకు గుట్కా, పాన్,సిగరెట్లు అమ్మే షాపులు ఉండకూడదని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు ఆరోగ్యశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల పరిసరాలను పరిశీలించే బాధ్యతను ఏఎన్ఎంలకు అప్పగించారు. ప్రతిస్కూల్ పర్యవేక్షణ కోసం మ్యాపింగ్ చెయ్యనున్నారు. వీటిని ఆన్లైన్ పోర్టల్ కు అనుసంధానిస్తారు.స్కూల్ ఆవరణలో పొగతాగడం వల్ల వచ్చే అనర్దాల గురించిన పోస్టర్లు ఏర్పాటు చేయనున్నారు.
ఒక్కో ఏఎన్ఎంకు రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు అప్పగించనున్నారు. అందుకు ప్రభుత్వం కొత్తగా ఓ యాప్ ను తీసుకొచ్చింది. ఏఎన్ఎం ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితిని ఫోటోలు తీసి యాప్ లో అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. పాఠశాలల సమీపంలో పాన్,గుట్కా షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. పాఠశాల సమీపంలో సిగరెట్ తాగడాన్ని కూడా నిషేదించారు. మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో లేకుండా చేయాలని నిర్ణయించారు.