గంగాధర, జూలై 24: మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మండలంలోని బూరుగుపల్లిలోని నివాసంలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులతో కలిసి సెల్ఫీ దిగారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధిస్తోందన్నారు. భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.