ఇటీవల టాలీవుడ్ లో మల్టీ స్టారర్ చిత్రాలు రూపొందుతుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహాసముద్రం అనే మల్టీ స్టారర్ కొద్ది రోజుల క్రితం విడుదల కాగా, ఈ మూవీ నిరాశపరచింది. పలు మల్టీ స్టారర్స్ కూడా ఇప్పుడు సెట్స్పై ఉన్నాయి.
యువ హీరోలతో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్న చిరంజీవి కూడా మల్టీ స్టారర్ చేసేందుకు సిద్ధమైనట్టు సమాచారం.తాజాగా చిరుకు శ్రీకాంత్ అడ్డాల ఓ కథ వినిపించారట. శ్రీకాంత్ చెప్పిన కథకు చిరు సానుకూలంగా స్పందించారని, పూర్తి స్క్రిప్ట్ను సిద్ధం చేయన్నారని సమాచారం. ఇందులో చిరంజీవితో పాటు మరో కీలకమైన పాత్ర ఉండగా, దానికి అల్లు అర్జున్ అయితే బాగుంటుందని శ్రీకాంత్ సూచించారట. గతంలో చిరు నటించిన ‘డాడీ’, ‘శంకర్దాదా జిందాబాద్’ చిత్రాల్లో అల్లు అర్జున్ తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం చిరంజీవి.. మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ చిత్రం చేస్తున్నారు. ఈ మూవీ ప్రస్తుతం సెట్స్పై ఉంది. ‘భోళా శంకర్’ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇక బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.