అమరావతి: మెగాస్టార్ చిరంజీవి తన స్వార్థం కోసమే ఏపీ సీఎం జగన్ను కలిసి సినిమా రాయితీలు మాట్లాడుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, సినిమాలను భయంగా వీక్షించవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమపై ఆదారపడ్డ వారందరినీ తన తోవలోకి తీసుకొచ్చేందుకు లేని సమస్యలను సృష్టిస్తుందని ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నందున వైఎస్ కుటుంబీకులే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐపైనే ప్రభుత్వం ఎదురుదాడి చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని రాజకీయ హత్యలు జరిగే అవకాశం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.