హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం మరో ఉద్యమ వీరుడిని కోల్పోయింది. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన డాక్టర్ చిరంజీవి కొల్లూరి(74) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. చిరంజీవి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
ఆయన కుటుంబం ఆస్పత్రి ఖర్చులు భరించలేని స్థితిలో ఉందని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు. రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా హాస్పిటల్కు వెళ్లి.. ప్రభుత్వ సహాయాన్ని అందజేశారు.