Chiranjeevi Emotional Tweet | సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్బాబు తల్లి ఇందిరా దేవి(70) మృతిచెందారు. గత కొంత కాలంగా వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఇందిరాదేవి బుధవారం తెల్లవారుజామున 4గంటలకు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమె మరణం పట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకులు ఇందరాదేవి మృతిపై సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా చిరంజీవి ఇందిరాదేవి మృతిపై ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
చిరంజీవి ట్విట్టర్లో ‘శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి, సోదరుడు మహేష్బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఇక ఇందిరాదేవి అంతిమ సంస్కారాలను బుధవారం సాయంత్రం మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు.
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ 🙏, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022