హైదరాబాద్: తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సమక్షంలో హైదరాబాద్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు హాజయర్యారు. ఈ సందర్భంగా చింత్రా ప్రభాకర్ను మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు అభినందించారు.
అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. అన్నివర్గాలకు సీఎం కేసీఆర్ సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చదువుకునే రోజుల నుంచే కేసీఆర్కు చేనేత కార్మికుల సమస్యలు తెలుసునని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.
హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చింతా ప్రభాకర్ను సీఎం కేసీఆర్ ఈ నెల 13న నియమించారు. రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నారు. సదాశివపేటకు చెందిన చింతా ప్రభాకర్ 20 ఏండ్ల పాటు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేశారు. 1995లో ఆయన సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2014లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.