హైదరాబాద్, సెప్టెంబర్ 12(నమస్తే తెలంగాణ) : తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్గా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. రెండేండ్ల పాటు ఆయన పదవిలో కొనసాగుతారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు పరిశ్రమల శాఖ నుంచి ఆయనకు జీతభత్యాలు చెల్లిస్తామని వివరించారు. సదాశివపేటకు చెందిన చింతా ప్రభాకర్ 20 ఏండ్ల పాటు ట్రేడ్ యూనియన్ నాయకుడిగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం కృషిచేశారు. 1995లో ఆయన సదాశివపేట మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. 2014లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.