ఇస్లామాబాద్, ఆగస్టు 17: పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ ద్వారా మధ్య ఆసియాపై తన ప్రాభవాన్ని పెంచుకోవాలనే ప్లాన్లో ఉన్న చైనా.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా పాక్-అఫ్గాన్ రీజియన్లో ఇప్పటికే బెల్ట్ అండ్ రోడ్డు ఇన్షియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు పేరుతో పెట్టుబడులు పెట్టింది.
ఈ రెండు దేశాల్లో తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రత్యేక ఔట్పోస్టుల వద్ద తమ సైన్యాన్ని మోహరించాలని చూస్తున్నది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని పాక్ ప్రభుత్వంపై చైనా ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు పాక్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.