న్యూఢిల్లీ: చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఈ నెలలోనే ఇండియాను విజిట్ చేయనున్నట్లు తెలుస్తోంది. భారత్కు రావడానికి ముందు ఆయన నేపాల్లోనూ పర్యటించనున్నారు. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్లో జరిగిన ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా మంత్రి వాంగ్ యి రాక ప్రత్యేకత సంతరించుకోనున్నది. 2020, జూన్ 15వ తేదీన లడాక్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాలకు చెందిన సైనికులు ఘర్షణకు దిగారు. ఆ దాడిలో 20 మంది భారతీయ, నలుగురు చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. బోర్డర్ ప్రతిష్టంభన తొలగించేందుకు రెండు దేశాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి.