జిన్జియాంగ్: చైనాలో ఇంకా కొన్ని నగరాల్లో కోవిడ్ లాక్డౌన్లు కొనసాగుతున్నాయి. ఆ పట్టణాల్లో తీవ్ర ఆహార, నిత్యావసరాల కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయి. కనీసం 30 ప్రదేశాల్లో లక్షలాది మందికి స్టే ఎట్ హోమ్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా, కొన్ని చోట్ల పూర్తి లాక్డౌన్ అమలులో ఉంది. కనీసం 15 రోజుల నుంచి గోధుమ పిండి, బియ్యం, గుడ్లు లేవని, పిల్లలకు పాలు కూడా దొరకడం లేదని జిన్జియాంగ్కు చెందిన ఓ వ్యక్తి ఆరోపించాడు. అక్టోబర్లో కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కోవిడ్ను నియంత్రించాలని అధికారులు భావిస్తున్నారు. సోమవారం రోజున చైనాలో కొత్తగా 949 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. జిన్జియాంగ్లో కజకస్తాన్ బోర్డర్ వద్ద కొన్ని వారాల నుంచి లాక్డౌన్ అమలులో ఉంది. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.