కాశీబుగ్గ, ఆగస్టు 29: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సోమవారం మిర్చికి రికార్డు స్థాయి ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా క్వింటాల్కు రూ.65 వేలతో వ్యాపారులు కొనుగోలు చేశారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మడిపెల్లికి చెందిన యార రవి 21 బస్తాల దేశీ రకం మిర్చి తీసుకురాగా, వ్యాపారి క్వింటాల్కు 65 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. కోల్డు స్టోరేజీల్లో రైతులు నిల్వ చేసిన మిర్చికి అత్యధికంగా ధర పలికిందని అధికారులు చెప్పారు. మిర్చికి అధిక ధరలు పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.