వరంగల్ : మిర్చి పంట రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చికి రికార్డు ధర పలికింది. క్వింటాల్ ధర రూ.90 వేలు పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.
ఈ ధర ఆల్ టైం రికార్డ్ గా వ్యాపారులు చెప్పారు. హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని హైబత్ పల్లి గ్రామ రైతు కంచ అశోక్ తెచ్చిన దేశీ రకం మిర్చికి క్వింటాల్ ధర రూ. 90 వేల లభించింది. దేశీ రకం మిర్చికి ఇంత ధర పలకడం ఇదే ఫస్ట్ టైం.