న్యూఢిల్లీ : ఛత్రసాల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ హత్య కేసులో ఒలింపిక్ పతక విజేత సుశీల్కుమార్ జూడో కోచ్ సుభాష్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసులో సుభాష్కు సైతం సంబంధాలు ఉన్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్తో పాటు అతని సన్నిహితులు పోలీసుల కస్టడీలో ఉన్నారు. మే 4న సాగర్తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్కుమార్పై సుశీల్కుమార్.. స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో పరారీలో ఉన్న రెజర్ల్తో పాటు సహ నిందితుడు అజయ్కుమార్ను మే 23న ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. హత్య కేసులో సుశీల్తో సహా 11 మందిని ఇప్పటి వరకు పోలీసులు అరెస్టు చేశారు. కేసులో సుశీల్ కస్టడీని జూన్ 25 వరకు ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టు ఇటీవల పొడగించింది.
ఇవి కూడా చదవండి..