టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ ఛటేశ్వర్ పుజారా తను వన్డేల్లోనూ సత్తా చాటగలనని నిరూపించుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్టు తర్వాత మళ్లీ కౌంటీలు ఆడేందుకు వెళ్లిపోయిన అతను.. అక్కడ తన పరుగుల వరదను కంటిన్యూ చేస్తున్నాడు. ససెక్స్కు కెప్టెన్గా ఉన్న పుజారా.. సర్రేతో జరిగిన మ్యాచ్లో తన వ్యక్తిగత అత్యధిక స్కోరు చేశాడు. ఈ మ్యాచ్లో 131 బంతులు ఎదుర్కొన్న ఈ ససెక్స్ సారధి 174 పరుగులు చేశాడు.
తన ఇన్నింగ్స్లో ఏకంగా 20 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. ఇది లిస్ట్-ఏ మ్యాచుల్లో పుజారా అత్యధిక స్కోరు. అంతకుముందు 2012 సెప్టెంబరు 30న ఇండియా-బి తరఫున ఆడిన పుజారా.. ఇండియా-ఏతో జరిగిన మ్యాచ్లో 158 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొట్టి 174 పరుగులు చేశాడీ 34 ఏళ్ల బ్యాటర్. అతను భారీ ఇన్నింగ్స్ ఆడటంతో ససెక్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది.