ఖైరతాబాద్, మార్చి 14: మంచి ఆహారం.. వ్యాయామంతో కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వైద్య నిఫుణులు స్పష్టం చేశారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఆధ్వర్యంలో ఆదివారం నెక్లెస్ రోడ్డులోని జలవిహార్ వద్ద నిర్వహించిన 5కే రన్ను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ రన్ జలవిహార్ నుంచి రోటరీ చౌరస్తా మీదుగా కొనసాగింది. డీజీపీ మాట్లాడుతూ కిడ్నీ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ప్రజలు తమ జీవనశైలిని మార్చుకోవాలని, సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ, చక్కని వ్యాయామం చేయాలని, తద్వారా ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో ఏఐఎన్యూ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, చైర్మన్ పీవీఎస్ రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పూర్ణచంద్రారెడ్డి పాల్గొన్నారు.