జోగులాంబ గద్వాల : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అలంపూర్ క్షేత్రంలో రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా సంపప్రదాయబద్ధంగా ఆలయ అర్చకులు, పాలకమండలి సభ్యులు ప్రారంభించారు. మొదట తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం పట్టణానికి చెందిన దామోదర్ రెడ్డి రథంపై పోల్ చల్లారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మంత్రోచ్ఛారణలతో భక్తులు ఓం నమః శివాయా శంబో శంకర నినాదాలు చేస్తూ రథాన్ని ముందుకు లాగారు. రథోత్సవం సందర్భంగా పట్టణంలోని ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.