అమరావతి : చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ దంపతులు హత్యకేసు విచారణలో జాప్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. జాప్యం లేకుండా నిందితులను శిక్షించాలని కుటుంబసభ్యులు కోరారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు బాధితుల వినతిపై చర్యలు తీసుకోకుండా సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కీలక సాక్షి అయిన సతీశ్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారని తెలిపారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ దాడి చేసి అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు.
అడ్డుకున్న మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసు చర్యలను నిరసించిన ఆమెపై పోలీసు జీపు ఎక్కించారని లేఖలో ఫిర్యాదు చేశారు. పైగా పోలీసు జీపు డ్రైవర్పై దాడి జరిగిందని ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. పూర్ణపై అక్రమ కేసు బనాయించిన పోలీసుపై చర్యలు తీసుకోవాలని ,టీడీపీ నాయకులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.