హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో ఇరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆడియో కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే.. తన ఆరోపణలపై విచారణకు కూడా సిద్ధమేనని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రకటించారు. చంద్రబాబు ఆడియోను అమెరికా ల్యాబ్లో టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఒక సామాజికవర్గానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తనపై ఫేక్ వీడియో కాల్ను సృష్టించి దుష్ప్రచారం చేశారని ఆరోపించారు. ఒరిజినల్ వీడియో తన వద్ద ఉన్నదని, పోలీసులు అడిగితే ఫోన్ ఇస్తానని వెల్లడించారు.