అమరావతి : మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ మంచితనానికి మారుపేరని టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఇద్దరు ట్విట్టర్ వేదిక ద్వారా స్పందిస్తూ నివాళి అర్పించారు. హరికృష్ణ అటు రాజకీయాల్లోనూ నటనలోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్నారని కొనియాడారు.
తండ్రి ఎన్టీఆర్ ఆదర్శాలను జవదాటని కొడుకుగా, చైతన్య రథసారథిగా, నటుడిగా తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారన్నారు. ముక్కుసూటితనం హరి మావయ్య నైజమని, తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండటం ఆయనే ప్రత్యేకత అని నారా లోకేశ్ అన్నారు.