టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు నిఖిల్ సిద్దార్థ్ నటించిన కార్తికేయ 2 (Karthikeya 2). చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వం వహించాడు. ఆగస్టు 13న థియటేర్లలో గ్రాండ్గా రిలీజైన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. చందూ మొండేటి టీం రియల్ లొకేషన్లలో ఎంతో కష్టపడి తీసిన సన్నివేశాలు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయని ఇప్పటివరకు వచ్చిన మౌత్ టాక్ చెబుతోంది.
తొలుత హిందీలో తక్కువ థియేటర్లలో స్క్రీనింగ్తో మొదలైన ఈ చిత్రం తాజా అప్డేట్ ప్రకారం వెయ్యికిపైగా థియేటర్లలో సక్సెస్ ఫుల్గా ప్రదర్శితమవుతుందని ఇన్సైడ్ టాక్. కాగా డైరెక్టర్ చందూ మొండేటి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ను కలిసిన స్టిల్ను ఇన్ స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘ఆ దీవెనలు..జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలు..అమితాబ్ జీ ధన్యవాదాలు..’అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ స్టిల్ చూస్తుంటే కార్తికేయ 2 సినిమా చూసిన బిగ్ బీ డైరెక్టర్ చందూ మొండేటికి తనను కలవాలని పిలుపునిచ్చి ఉంటాడని టాక్ నడుస్తోంది.
మొత్తానికి హిందీలో రక్షాబంధన్, లాల్ సింగ్ చడ్డా లాంటి భారీ సినిమాలను వెనక్కి నెట్టేసి కార్తికేయ 2 ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఫుల్ ఖుషీగా ఉంది చందూమొండేటి టీం. అమితాబ్ దీవెనలు ఫలించాయని ఈ ఫొటో చూస్తుంటూ అర్థమవుతుంది. నార్తిండియాలో ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు థియేటర్ల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారంటే..కార్తికేయ 2కు ఆదరణ ఎలా ఉందో చెప్పవచ్చు.