– రైసు మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారుపల్లి దయాకర్రెడ్డి
కందుకూరు/ ఆర్కేపురం, ఏప్రిల్ 4 : తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదని రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పారుపల్లి దయాకర్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అర్వింద్ కు మార్ అన్నారు. ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయం ముందు డివిజన్ టీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ధర్నాలు, రాస్తా రోకోలు నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు లోడి నర్సింహగౌడ్, సుదర్శన్ ముదిరాజ్, జంగారెడ్డి, రాఘవేంద్రగుప్త, ఇస్మాయిల్, సలీం, రాము పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమం ఆగదు..
కందుకూరు : కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రంలో కొనుగోలు చేసే విధంగా రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని రెండు పంటలు కొనుగోలు చేయాలని లేని పక్షంలో ధాన్యం కొనుగోలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామని టీఆర్ఎస్ నాయకులు తెలిపారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా సోమవారం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్ష చేశారు. మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ, రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ రైతులు నష్ట పోవద్దని రైతుల పక్షాన ఉంటూ పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సురసాని సురేందర్రెడ్డి, గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సత్యనారాయణ, చిర్ర సాయిలు, ఎలుక మేఘనాథ్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, అమరేందర్రెడ్డి, ఈశ్వర్గౌడ్, పొట్టి ఆనంద్, సామ ప్రకాశ్రెడ్డి, సురుసాని శేఖర్రెడ్డి, పాండురంగారెడ్డి, సామ మహేందర్రెడ్డి, తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, నరేందర్గౌడ్, బాలమల్లేశ్, హన్మంత్రెడ్డి, తాళ్ల కార్తీక్, మోహన్రెడ్డి, విజ్ఞేశ్వర్రెడ్డి, మస్కు బాబు,అశోక్ ముదిరాజ్, బొక్క దీక్షిత్రెడ్డి,ప్రశాంత్చారి, కృష్ణారెడ్డి, గుయ్యని సామయ్య, రామక్రిష్ణారెడ్డి, ఉమాకాంత్రెడ్డి పాల్గొన్నారు.