న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కు చెందిన మరో 270 మందిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్లో దాడులు నిర్వహించిన ఆయా రాష్ర్టాల పోలీస్ బృందాలు.. పీఎఫ్ఐతో లింక్ ఉన్న వారిని అదుపులోకి తీసుకొన్నాయి.
ఉత్తరప్రదేశ్లో 56, ఢిల్లీ 34, అస్సాం 23, మధ్యప్రదేశ్ 21, మహారాష్ట్ర 47, గుజరాత్ 15, కర్ణాటకలో 74 మందిని అరెస్టు చేశామని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 22న ఎన్ఐఏ దేశవ్యాప్తంగా 15 రాష్ర్టాల్లో సోదాలు నిర్వహించి 106 మంది పీఎఫ్ఐ సభ్యులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా, పీఎఫ్ఐపై నిషేధం విధించేందుకు కేంద్రం నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.