ఢిల్లీ ,జూన్ 2; కరోనా మహమ్మారి సమయంలో మహిళా ఉద్యోగులు.. ముఖ్యంగా పాలిచ్చే తల్లుల ప్రయోజనాలను కాపాడటంలో భాగంగా, వాళ్లు ఇంటి నుంచి పని చేయడాన్ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ప్రసూతి ప్రయోజనం (సవరణ) చట్టం, 2017 లోని సెక్షన్ 5 (5) ప్రకారం పాలిచ్చే తల్లులకు ఇలాంటి వెసులుబాట్లను కల్పించవచ్చని పేర్కొన్నది కేంద్ర సర్కారు. ఒక మహిళకు కేటాయించిన పని ఆమె ఇంటి నుంచి పని చేయగలిగినది అయి ఉండే ప్రసూతి ప్రయోజనాన్ని పొందిన తరువాత , యజమాని ఆమెకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించవచ్చు. ఇరువర్గాల సమ్మతితోనే నిర్ణయం తీసుకోవాలి.
కోవిడ్ మహమ్మారి సమయంలో పాలిచ్చే తల్లులు,వారి బిడ్డల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వైరస్ బారిన పడకుండా వారిని కాపాడటానికి, కార్మిక,ఉపాధి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది. ఆయా పనిని బట్టి వర్క్ ఫ్రం హోం విధానానాకి అనువుగా ఉంటే పాలిచ్చే తల్లులకు ఆ సదుపాయం కల్పించాలని సూచించింది కేంద్రం.